న్యూ ఢిల్లీ (09జూన్ 2024)
కేంద్ర మంత్రి వర్గంలో తెలంగాణ నుంచి ఇద్దరికీ చోటు లభించింది. ఇప్పటికే అయిదేళ్లపాటు మంత్రిగా పని చేసిన జి. కిషన్ రెడ్డికి మరోసారి మంత్రి పదవి దక్కింది. ఈయన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండో సారి ఎంపీగా గెలిచారు. ఇక కరీం నగర్ ఎంపీగా రెండో సారి గెలిచిన బండి సంజయ్ కుమార్ కు కూడా మంత్రి వర్గంలో చోటు లభించింది. బండి తొలిసారిగా మంత్రి అయ్యారు. కిషన్ రెడ్డి కంటే ముందు బండి సంజయ్ కుమార్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పని చేశారు.
Post Views: 66