ఏపీ రాజధానిగా విశాఖ-ఉగాదికి ముహూర్తం

 

అమరావతి : ఏపీ రాజధానిగా విశాఖపట్నం ఖాయమని, పాలన సాగించడానికి అవసరమైన అన్ని వసతులు అక్కడ ఉన్నాయని వైఎస్సార్​సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా పాలన సాగుతుందని తెలిపారు. రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడా ఉండదు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే.. అక్కడే ఆఫీస్ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రితో పాటు రాజధాని కూడా విశాఖకు మారుతుంది అని మంత్రి గుడివాడ అమర్నాథ్ సీఎం ఎక్కడుండి పరిపాలిస్తే అదే రాజధాని అని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు.

‘రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడా ఉండదు. ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎక్కడుంటారో అక్కడే ఆఫీస్. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే ఆఫీస్. ముఖ్యమంత్రి ఎక్కడ నిర్ణయం తీసుకుంటే అదే ఆఫీస్ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.

ఉగాది నుంచే విశాఖ కేంద్రంగా పరిపాలన సాగనుందని ప్రభుత్వ చీఫ్‌విప్‌ కరణం ధర్మశ్రీ తెలిపారు. అదేరోజు విశాఖ రాజధానిగా సీఎం ప్రకటించనున్నారని ఆయన తెలిపారు.

విశాఖ నుంచి పాలన సాగించడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. రాజధానిని విశాఖకు తరలించడం ఖాయమని, అదే విషయం సీఎం జగన్ మరోసారి చెప్పారని వైఎస్సార్​సీరీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని తెలిపారు. సుప్రీంతీర్పు తమకు అనుకూలంగా వస్తుందని, ఒకవేళ రాకున్నా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్‌లో మూడు రాజధానుల బిల్లు పెట్టిస్తామని కొడాలినాని వివరించారు. మూడు రాజధానుల ఏర్పాటే ప్రభుత్వ సంకల్పమని పేర్నినాని అన్నారు.

‘కొత్త బిల్లు తీసుకుని వస్తాం. ముఖ్యమంత్రి అనే వారు ఈ రాష్ట్రానికి రాజులాంటి వాడు. ఆయన పరిపాలన ఎక్కడి నుంచి చేస్తే అదే రాజధాని. ముఖ్యమంత్రితో పాటు రాజధాని కూడా వస్తుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest