కేసీఆర్ తో విభేదాలు లేవు : కుమార్ స్వామి స్పష్టికరణ

రాయచూర్
.బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తో తనకు గ్యాప్ వచ్చిందన్న ఊహాగానాలను కర్ణాటక మాజీ సీఎం, జేడీ(ఎస్)నేత కుమార స్వామి కొట్టిపారేశారు.రాజకీయాల్లో తన తండ్రి దేవేగౌడ తర్వాత అంతటి మార్గదర్శి కేసీఆర్ యే అని కుమారస్వామి అన్నారు. రాయచూర్ లో జరిగిన పంచరత్న యాత్ర లో నారాయణ పేట బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తో 24 జిల్లాల రైతులకు మేలు జరుగుతోందన్నారు. మిషన్ భగీరథ పథకం తో తెలంగాణ లోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు లభిస్తోందన్నారు. కర్ణాటక లో తాము అధికారం లోకి వస్తే కేసీఆర్ స్ఫూర్తి తో పథకాలు అమలు చేస్తామని చెప్పారు.కాంగ్రెస్, బీజేపీ లు కర్ణాటక అభివృద్ధిని వెనక్కు నెట్టాయని కుమార్ స్వామి ఆరోపించారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest