వైసీపీ ప్రభుత్వ దురాగతాలను ప్రజల్లో ఎండగడతాం

 

  • భారాస ఎపి అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్

గుంటూరు:

వైసీపీ ప్రభుత్వ దురాగతాలను ప్రజల్లో ఎండగతామని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. సోమవారం హైదారాబాద్ లోని బి ఆర్ ఎస్ ఎపి క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ పాలనలో అన్నిరంగాలు నిర్వీర్యమయ్యాయని దుయ్యబట్టారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వైసీపీ సర్కార్ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసాగిస్తోందని ఆరోపించారు. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో చేపట్టిన కార్యక్యమంలో ప్రజల నుండి ప్రజాప్రతినిధులకు ఎదురౌతున్న చీత్కరింపులే వైసీపీ పాలనకు నిదర్శనమన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన గత టిడిపి ప్రభుత్వానికి పట్టిన గతే వైసీపీ ప్రభుత్వానికి పడుతుందని స్పష్టం చేశారు. భారాస అధినేత సిఎం కేసిఆర్ నాయకత్వాన్ని ఎపి ప్రజలు ఆహ్వానిస్తున్నారని స్పష్టం చేశారు . తొలుత భారాస రాష్ట్ర నాయకులు తలారి సురేష్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాకి చెందిన యూత్ కాంగ్రెస్ కార్యదర్శి పి.సత్యనారాయణ తోట సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు . ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు గిద్దా శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే గుంటూరులోని భారాస రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర నేతలు షేక్ బాష,షేక్ ఖాజావలి సారధ్యంలో యర్రగొండపాలెం కు చెందిన దళితవర్గ నేత దూపాటి చంద్రబాబు నేతృత్వంలో బాలయేసు, విజయబాబు , మణికుమార్ , షడ్రర్ , నాసర్ బాబు భారాస తీర్ధం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నేత డాక్టర్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest