7 లక్షల వరకు ఆదాయపు పన్ను ఊరట

న్యూ ఢిల్లీ
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ప్రధానంగా ఆదాయపు పన్ను పై కేంద్రం ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఆదాయపు పన్ను పరిధిని 7 లక్షల రూపాయల వరకు పెందించి. దేశంలోని మధ్య తరగతి ప్రజలకు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయం శువైభవార్త లాంటిదేనని భావించవచ్చు. అలాగే వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిని 3 లక్షల వరకు పెంచింది. 2023-24 కేంద్ర బడ్జెట్ బుధవారం (ఫిబ్రవరి 1) పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది. వ్యక్తిగతంగా 3 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 3 లక్షల పైన ఉన్న వాళ్ళు మాత్రమే కొత్త స్లాబ్ రేట్ల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest