700 మందికి ఒకే టాయిలెట్. హైకోర్టుకు విద్యార్థినుల లేఖ

సరూర్ నగర్

హైకోర్టుకు సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు లేఖ రాశారు. కాలేజీలో 700 మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటే అందరికీ ఒకే టాయిలెట్ ఉందని వారు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై స్పందించిన హైకోర్టు.. సుమోటోగా కేసు విచారణకు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. సీఎస్, విద్యాశాఖ సెక్రెటరీ, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనర్కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest