అమెరికా
అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. పలు చోట్ల కాల్పులు జరిగాయి. కాల్పుల్లో నలుగురు మరణించగా, సుమారు ముఫై ఎనిమిది మందికి గాయాలైయ్యాయి. ఈ ఘటన శనివారం అమెరికాలో చోటుచేసుకుంది. ఇల్లినాయిస్, మిసోరి , వాషింగ్టన్ ప్రాంతాల్లో ఒకేరోజు మూడు చోట్ల కాల్పులకు తెగబడ్డారు. స్థానిక పోలీసులపై కాల్పులు జరుపగా ఒకరు మృతి చెందారు. పొలిసు వాహనంపై మొదట బుల్లెట్ల వర్షం కురిసింది. కాల్పులు జరిపిన వ్యక్తిని బ్రాండన్ స్టైన్ గా పోలీసులు గుర్తించారు. పోలీసుల వాహనంపై కాల్పులు జరిపింది ఇతనేనని పెన్సిల్వేనియా స్టేట్ పోలీస్ కమిషనర్ కల్నల్ క్రిస్టోఫర్ పారిస్ తెలిపారు. వెంటనే తమ పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
Post Views: 114