అమెరికా :
భారత ప్రధాని అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికాలో మోడీకి ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సభలో అక్కడి ప్రాంతానికి చెందిన గాయని మేరీ మిల్ బెన్ భారతీయ జాతీయ గీతం జన గణ మన పాటను ఆలపించారు. అనంతరం వేదికమీదనే ఉన్న మోడీ కాళ్లకు ఆమె నమస్కరించారు. ప్రధాని మోడీ కోసం భారత జాతీయ గీతాన్ని ఆలపించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్బంగా గాయని మేరీ తెలిపారు. ముఫై ఎనిమిదేళ్ల మేరీ మిల్ బెన్ వాషింగ్టన్ డీసీ లోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటెర్నేషనల్ యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ (USICF ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. భారత జాతీయ జీతాన్ని ఆలపించిన మేరీ కేవలం గాయని మాత్రమే కాదు ప్రముఖ ఆఫ్రికన్ అమెరికన్ హాలీవుడ్ నటి కూడా.
Post Views: 115