ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

రంగారెడ్డి

జిల్లాలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శశాంక అన్నారు.

శనివారం జిల్లా కలెక్టర్ శశాంక ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేందర్ కుమార్ కటారియా, పోలీస్ పరిశీలకులు కాలు రామ్ రావత్, వ్యయ పరిశీలకులు రాజీవ్ చావ్రాలతో కలిసి స్వీప్ కార్యక్రమంలో భాగంగా Vote for Sure, నేను ఖచ్చితంగా ఓటు వేస్తానని అనే నినాదంతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వీప్ సెల్ఫీ పాయింట్ ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, వికారాబాద్ అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ ఉమా హారతి, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ సేహ్న, పోలీస్ అధికారులు, పిడి డిఆర్డీఎ శ్రీలత సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest