టీడీపీ కేంద్ర కార్యాలయం లో మీడియాతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిట్ చాట్:-
• జగన్ ఇప్పటి వరకు పబ్లిక్ ను ఫూల్స్ చేస్తూ వచ్చాడు. ఫైనల్ గా జగన్ ను ప్రజలు పెద్ద ఫూల్ ను చేస్తారు. తన చర్యల వల్ల జగన్ ఫూల్ అవ్వడం ఖాయం. జరిగేది ఇదే.
• నేడు అప్పులతో రాష్ట్రం ఎటుపోతుందో అర్థం కావడం లేదు. నేడు రాష్ట్ర అప్పు రూ. 10.31 లక్షల కోట్లకు చేరింది.
• సిఎం జగన్ ఒకవైపు పన్నులు వేస్తున్నాడు. మరోవైపు లక్షల కోట్ల అప్పులు చేస్తున్నాడు? ఆ డబ్బు అంతా ఎక్కడికి పోతుంది?
• ఈ ఒక్క ఏడాదిలోనే జగన్ రూ.96 వేల కోట్ల అప్పు చేశాడు.
• ఇలా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే ఎలా?
• ఇది మరింత ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుంది. రాష్ట్రం పూర్తిగా దివాళా తీస్తుంది.
• లక్షల కోట్ల అప్పులు చేసినా పోలవరం పూర్తి చేయలేదు. అమరావతి నాశనం చేశాడు….ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయలేదు….రోడ్లు వేయలేదు….రైతులకు సబ్సిడీలు లేవు, జీతాలు ఇవ్వలేకపోతున్నాడు….మరి ప్రభుత్వం చేసిన 10 లక్షల కోట్ల అప్పులు ఎక్కడికి పోయాయి?
• ప్రభుత్వంలో నిధుల దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తుంది.
• ఇవన్నీ చూసిన తరువాత రాష్ట్రం ఏమవుతుంది అనే ఆవేదన, బాధ కలుగుతుంది.
• రాష్ట్రాన్ని నాశనం చేయడానికే జగన్ రెడ్డిపుట్టాడా అని అందుకే నేను అన్నాను.
• విభజన తరువాత మనకు హైదరాబాద్ లేదు కాబట్టి…మన భవిష్యత్ ఏంటి అని ప్రజలు నాడు భపడ్డారు. అందుకే అమరావతికి రూపకల్పన చేశాను.
• నేడుతెలంగాణ పర్ క్యాపిటా ఇన్ కం రూ. 3.08 లక్షలకు చేరింది. అంటే దేశంలోనే ప్రధమంగా నిలిచింది.
• అందుకే నా తరువాత అక్కడ వచ్చిన ముఖ్యమంత్రులను నేను అభినందించాను. నాడు చేసిన సంస్కరణలు, నిర్ణయాల కారణంగా మంచి ఫలితాలువచ్చాయి. తరువాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని కొనసాగించాయి.
• ఇప్పుడు ఆ ఫలాలను తెలంగాణ అనుభవిస్తుంది.
• కానీ ఇప్పుడు ఎపిలో పర్ క్యాపిటా ఇన్ కం రూ. 2.19 లక్షలు. అంటే తెలంగాణకు , ఎపికి ఎంత తేడా ఉందో చూడండి. ఒక మనిషి విధ్వంసం వల్లనే ఎపిలో ఈ పరిస్థితి వచ్చింది.
• హైదరాబాద్ అభివృద్దిని ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. అందుకే మంచి ఫలితాలు వచ్చాయి.
• తెలంగాణలో ఇప్పుడు భూముల విలువ కూడా పెరిగింది. తెలంగాణ లో ఉండే మారుమూల ప్రాంతాల్లో కూడా భూముల ధరలు లక్షలు, కోట్లు అయ్యాయి.
• కానీ ఎపిలో నేడు ఇప్పుడు భూములు కొనే వారు లేరు. పోలవరం పూర్తి అయ్యి ఉంటే అద్భుత ఫలితాలు దక్కేవి
• కియా పరిశ్రమపై నాడు జగన్ ఏమని ప్రచారం చేశాడు..ఏమి వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఆ కియా వల్ల ఆ ఏరియా రూపురేకలు మారిపోయాయి. 25 వేల మంది ప్రత్యక్షం గా లబ్ధి పొందారు. ఆ ప్రాంతం లో భూముల విలువ పెరిగింది.
• దేశంలో నెంబర్ 1 దోపీడీ దారుడు జగన్ కాక ఇంకెవరు?
• దేశంలో అందరి సిఎంల సంపద కంటే….జగన్ సంపదే ఎక్కువ
• ప్రజలను లూటీ చేసి నేను పేదల మనిషిని అంటే జగన్ ను ప్రజలు నమ్ముతారా?
• ఇసుకలో వందల కోట్లు అక్రమాలు చేస్తూ నేను పేదల మనిషిని అంటే ఎలా?
• జగన్ డబ్బు అంతా ఎక్కడికి తరలిస్తున్నాడు..నేలమాలిగల్లో పెట్టాడా అని పిస్తుంది.
• జగన్ అవినీతి చేసి అందరిపై బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నాడు.
• ముందస్తు ఎన్నికలు జరిగితే జగన్ ను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు.
• మేము ఎన్నికలకు సిద్దంగా లేము అనేది జగన్ పగటి కల. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎన్నికలకు మేం సిద్దంగా ఉన్నాం.
• ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసిపి కి షాక్ ట్రీట్మెంట్. వచ్చే ఎన్నికలు వైసీపీకి పర్మినెంట్ ట్రీట్మెంట్.
• ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో, అసహనంతో ఉన్నారు….వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఇంకా గట్టిగా ఉంటాయి.
• ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై బాధ్యత తీసుకుంటాను అని చెప్పిన బొత్స రాజీనామా చేయాలి కదా.
• జగన్ పాలనలో రాష్ట్ర సంపద నాశనం అయ్యింది. దోపిడీకి గురయ్యింది.
• ఆర్ధిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుడతాం. ప్రతి ఇంటికి ఒక విజన్ రూపొందిస్తాం. పేదల జీవితాలను సమూలంగా మార్చుతాం. దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం.
• ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ల ప్రయాణాన్ని మన రెండు రాష్ట్రాలు అన్వయించుకోవాలి
• తెలంగాణకు హైదరాబాద్ ఉంటే…ఎపికి సముద్ర తీరం ఉంది…ఎపిలో మంచి భూములు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే 2029 నాటికి దేశంలో టాప్ స్టేట్స్ గా ఈ రెండు రాష్ట్రాలు ఉండేవి.
• జగన్ కారణంగా ఎపి మునిగిపోయింది. అభివృద్ధి కొనసాగడం వలన అటు తెలంగాణ మాత్రం సక్సెస్ అయ్యింది.
• రిలయన్స్ అన్నదమ్ముల్లో ఏం జరిగిందో…..తెలుగు రాష్ట్రాల్లో జగన్ వల్ల అదే జరిగింది.
• ఒక మనిషి విధ్వంస ఎంత వేగంగా చేయగలడో జగన్ చూపించాడు
• బుద్ది ఉన్నవాడు అయితే 175 లో పోటీ చేస్తావా….లేదా అని అడుగుతారా….?
• జగన్ ను 175 ఓడించడం మా లక్ష్యం. రాజకీయాలకే అర్హత లేని వ్యక్తి జగన్.
• 175 లో పోటీ చేస్తారా అనేది ఒక బుద్ది లేని ప్రశ్న
• జగన్ ప్రజల బిడ్డ కాదు…పేదల బిడ్డ కాదు..రాష్ట్రాన్ని నాశనం చేసిన బిడ్డ.
• నెలకు ఒక్క ఇసుకలో 250 కోట్లు దోచేసిన జగన్ మీ బిడ్డ అంటే నమ్మాలా?
• గన్ కల్చర్, గొడ్డలి కల్చర్, గంజాయి కల్చర్ తెచ్చిన వాడిని నమ్మాలా?
• వైసిపి నుంచి చాలా మంది టీడీపీలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో చాలా మందిని హోల్డ్ లో పెట్టాం.
• ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగు దేశం గెలిస్తే ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారు అంటారా….మీ దగ్గర ఉన్న వాళ్లు ఎవరు.?
• మాకు 23 ఎమ్మెల్యేలు గెలిచిన చోట…ఇంగిత జ్ఝానం ఉంటే జగన్ పోటీ నే పెట్టకూడదు.
• సరిపోను సంఖ్యా బలం లేకపోయినా జగన్ 7 గురిని పోటీలో పెట్టాడు. బుద్ది ఉంటే తన పార్టీలో చేర్చుకున్న ఆ నలుగురిని పార్టీ నుంచి జగన్ బయటకు పంపాలి.
• కాస్తో కూస్తో ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్లు వైసిపిలో ఉండకూడదు. గౌరవం లేని వైసీపీలో ఎవరూ ఉండకూడదు. పబ్లిక్ లైఫ్ కి జగన్ కు అర్హత లేదు.
• ఎవరైనా పార్టీ మారితే రాజీనామా చేసి మా పార్టీలోకి రావాలి అని జగన్ నాడు సభలో అన్నాడా లేదా?
• మా పార్టీ నుంచి 4 గురిని తీసుకున్నారు….మరి దానిపై జగన్ ఏం సమాధానం చెపుతాడు?
• అంటే నాకు రావాల్సిన సీటును నేను వదిలేయాలా? నేను నిలబెట్టిన వారు గెలిస్తే…మ్యానేజ్ చేసినట్లా?
• చట్టాన్ని, ధర్మాన్ని బతికించాలి అనుకుంటున్నా…ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టా.
• భారత దేశ చరిత్రలో వివేకా హత్య కేసు అంత స్థాయిలో సంచలనం అయిన కేసు ఉందా?. ఇన్ని మలుపులు చూసిన కేసు ఇంకోటి ఉందా?
• వివేకా హత్య కేసులో తులసమ్మ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ పై వాయిదా వాయిదాకు లాయర్లను ఎలా మార్చుతున్నారు?
• తులసమ్మకు అంత స్దాయి ఉందా…సుప్రీం కోర్టులో లాయర్లను ఎవరు పెడుతున్నారు? డబ్బులుఎవరు ఇస్తున్నారు.
• అధికార పార్టీ దౌర్జన్యాలకు గురవుతున్న ఎమ్మెల్యే శ్రీదేవికి అండగా ఉంటాం. నాడు ఎంపీ రఘు రామ రాజుకు అండగా నిలిచాము
• బిజిపి నేతలపై దాడి ఉన్మాద చర్య. ప్రశ్నించే వారిపై ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారు.