BRSలో మహారాష్ట్ర నేతలు

హైదరాబాద్

మహారాష్ట్రలో బి ఆర్ ఎస్ పార్టీ విస్తరణ ప్రకంపనలు సృష్టిస్తున్నది . రోజు రోజుకు బి ఆర్ ఎస్ లో చేరే ప్రముఖుల సంఖ్య పెరుగుతున్నది. ఉగాది పండుగ రోజే బి ఆర్ ఎస్ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పలువురు ప్రముఖులు బి ఆర్ ఎస్ లో చేరారు. వారికి పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహారాష్ట్రలోని కాందహార్ లోయలో ఈ నెల 26 న బి ఆర్ ఎస్ పార్టీ భారీ బహిరంగసభను నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రముఖులు బి ఆర్ ఎస్ లో చేరడం గమనార్హం . ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హాజరయ్యే ఆ సభలో ఇంకా భారీ చేరికలు ఉంటాయని బి ఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి . బుధవారం పార్టీలో చేరిన వారిలో ప్రముఖులు హర్షవర్ధన్ జాదవ్ , సురేష్ గైక్వాడ్ , యెష్ పాల్ బింగే తో పాటు పలువురు బి ఆర్ ఎస్ లో చేరారు .

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest