- నిమ్స్ ఆస్పత్రి వద్ద పోలీసుల మోహరింపు
- ప్రీతి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించనున్న అధికారులు
- మృతదేహం తరలించేందుకు అంబులెన్స్ సిద్ధం చేసిన అధికారులు
- అంబులెన్స్ ముందు బైఠాయించిన ప్రీతి బంధువులు, గిరిజనులు.
- ప్రీతి మృతదేహాన్ని ప్రగతి భవన్కు తీసుకెళ్తామంటున్న బంధువులు.
- నిమ్స్ ఆస్పత్రి గిరిజన సంఘాలు, బీజేపీ కార్యకర్తల ఆందోళన
- ఆందోళనకు దిగిన బంధువులు
హైదరాబాద్
సీనియర్ వేధింపులు తాళలేక హానికర ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడి గత నాలుగు రోజులుగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వైద్య విద్యార్థిని ప్రీతి మృతి చెందింది. నిమ్స్లో చికిత్స పొందుతూ ఇవాళ రాత్రి ప్రాణాలు విడిచింది. ఎలాగైనా దేవుడి దయతో బ్రతికి వస్తుందని కోటి ఆశలతో ఎదురుచూసిన తల్లిదండ్రులకు కన్నీటి శోకమే మిగిలింది.ప్రీతి మరణంతో విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రీతి మరణంపై మంత్రి హరీశ్రావు స్పందించారు.
Post Views: 110