ర్యాగింగ్ కి తాళలేక విద్యార్థిని ఆత్మహత్య

భూపాలపల్లి

విద్యార్థి వేధింపులు, ర్యాగింగ్ కి తాళలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. భూపాలపల్లికి చెందిన శంకరాచారి రమ దంపతులకు చెందిన రక్షిత వరంగల్ జిల్లా నర్సంపేట లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీ మూడవ సంవత్సరం చదువుతుంది ఈ క్రమంలో ఓ విద్యార్థి మరో విద్యార్థితో కలిసి ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడంతో పాటు, ర్యాగింగ్ చేస్తుండడం తో

మనస్థాపానికి గురై వరంగల్ నగరంలోని తన బంధువుల ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు ఇది ఇలా ఉంటే గత రెండు రోజుల క్రితం భూపాలపల్లిలో రక్షితపై మిస్సింగ్ కేస్ నమోదయింది

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest