మంచిర్యాల:
తెలంగాణ రాష్ట్రం వచ్చి తొమ్మిది సంవత్సరాలవుతున్న బొగ్గు బాయి, బొంబాయి, దుబాయి బతుకులు మారలేదని సి ఎల్ పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. మంచిర్యాల, బెల్లంపల్లి ప్రాంతంలో ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్బంగా భట్టి మీడియాతో మాట్లాడారు.మన కొలువులు మనకే, మన సంపద మనకే, మన వనరులు మనకే అని ఉద్యమ సమయంలో మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించిన కెసిఆర్.స్థానిక ఉద్యోగులు 99 శాతం ఉన్న సింగరేణిలో 1.05 లక్షల నుంచి 42 వేల ఉద్యోగాలకు కుదించిన కేసీఆర్.సింగరేణిలో పనిచేస్తున్న 60 వేల మంది ఉద్యోగాలు తీసివేసి రోడ్డుపాలు చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం.నిజాం కాలం నుంచి ఇప్పటివరకు తెలంగాణకు నష్టం చేసిన దాంట్లో మొదటి వ్యక్తి సీఎం కేసీఆర్.సింగరేణిలో రిటైర్మెంట్ తప్ప కొత్త కొలువుల రిక్రూట్మెంట్ లేదు. సింగరేణి సంపదను ప్రైవేట్ వ్యక్తులకు దారా దత్తం చేస్తుంటే చూస్తూ ఊరుకుందామా? మన సంపద మనం కాపాడుకుందామా?ఓటమి భయంతోనే సింగరేణి ఎన్నికలు జర పని కేసీఆర్. ఎన్నికలు వచ్చినప్పుడే దళిత బంధు, దళిత ముఖ్యమంత్రి, గొర్లు, బర్లు,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, భద్రాద్రి రాముల వారి కళ్యాణానికి కోటి, నిరుద్యోగ భృతి, ఇండ్లు కట్టుకునే వారికి మూడు లక్షల సాయం, పోడు భూముల పట్టాల పంపిణీ కేసీఆర్ కు యాధికొస్తున్నాయి.తొమ్మిదేళ్లుగా ఇవే హామీలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్. 2014 వరకు ఇందిరమ్మ ఇళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయలు సాయం చేసింది. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని వైఫల్యం చెందిన బీఆర్ఎస్ ప్రభుత్వం. కొత్తగా మూడు లక్షల పథకాన్ని తెచ్చింది. 2014 సంవత్సరం నుంచి నేటి వరకు ఇండ్ల నిర్మాణం ఖర్చులు మూడు రెట్లు పెరిగిన ప్రభుత్వ ఇచ్చే సాయం పెద్దగా ఏమీ లేదు. ఎన్నికల ముందు కుర్చి వేసుకుని పోడు భూములు పంపిణీ చేస్తానని పదే పదే చెప్పే ముఖ్యమంత్రికి తొమ్మిదేళ్లవుతున్న కుర్చీ దొరకడం లేదా? కుర్చీ వేసుకునే స్థలం దొరకడం లేదా?అని ఎద్దేవా చేశారు.
బిఆర్ఎస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది
ఓటమి భయంతోనే ప్రజలను మాయ చేసేందుకు కేసిఆర్ హామీల వర్షం కురిపిస్తున్నారు. మరోసారి కెసిఆర్ భ్రమల్లో పడితే మనకే నష్టం. స్వతంత్ర భారతదేశంలో 9 సంవత్సరాలు సెక్రటేరియట్ లేకుండా పరిపాలన జరిగింది ఒక తెలంగాణలోనే.టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తే వాటికి సమాధానం చెప్పి నిజాయితీ నిరూపించుకోవాల్సింది పోయి నేరస్తుని పిలిచినట్టు సిట్ కార్యాలయానికి పిలవడాన్ని ఖండిస్తున్నా. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.92 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. అధికారులు, బ్యూరో క్రసి నిబద్దతతో బిజినెస్ రూల్స్ ప్రకారం విధులు నిర్వహించాలి. ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలతో అడ్డగోలుగా పనిచేసి ఈ దేశ బ్యూరోక్రసికి మచ్చ తీసుకురావద్దు. పంట నష్టం పై పూటకో మాట చెబుతూ తప్పుదోవ పట్టిస్తున్న సీఎం వైఖరిని ఖండిస్తున్న
టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రం లీకేజీ వాస్తవమే కదా? ప్రశ్న పత్రం తయారు చేసింది వాళ్లే.. లీకు చేసింది వాళ్లే. టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రం లీకేజీ లో పాలనధ్యక్షులు నీతిమంతులమని సమర్థించుకోవడం విడ్డూరం. రాహుల్ వెంటనే దేశ ప్రజలు. దేశద్రోహులు ఆర్థిక నేరస్తులు మోడీ వెంట. బ్యాంకులో నుంచి తీసుకున్న కోట్ల సంపద ఎగ్గొడుతున్న ఆర్థిక నేరస్తులతో అంటకాగుతున్న మోడీకి ప్రజలు బుద్ధి చెప్తారు. రాహుల్ గాంధీకి శిక్ష పడేలా చేసి, పార్లమెంటుకు రాకుండా అనర్హత వేటు వేసి, ఇప్పుడు ఇల్లు లేకుండా చేసిన బిజెపి ప్రభుత్వానికి ప్రజలే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారు. రాహుల్ గాంధీ పైన ఎన్నిసార్లు అనర్హత వేటు వేస్తే అన్ని సార్లు ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకొని గెలిపించి పార్లమెంటుకు పంపుతారు. గాంధీ కుటుంబస్తులు తమ జీవితాలను, ఆస్తులు దేశానికి అంకితం చేసిన చరిత్ర.
ఒక్కసారి ఎమ్మెల్యే పదవి చేపడితేనే కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కుటుంబం 9 ఏండ్ల ల్లో లక్షల కోట్లు సంపాదన పోగేసుకున్నారు. ఈ దేశాన్ని చాలా సంవత్సరాల పాటు పరిపాలించిన రాహుల్ గాంధీ కుటుంబం సొంత ఇల్లు లేకపోగా ఉన్న క్వార్టర్ను ఖాళీ చేయాలని చేస్తున్న బిజెపి . దేశ సంపద, ప్రజాస్వామ్యం ప్రజలకే చెందాలని కోరుకునే రాహుల్ గాంధీపై బిజెపి కక్ష సాధింపు చర్యలు ఖండిస్తున్నాం. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు తాను చేసే పాదయాత్రలో ప్రధాని మోడీ ఆగడాలు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్యాగాలను చాటి చెబుతాను. తలాపున ప్రాణహిత పారుతున్న సాగునీటికి నోచుకోని బెల్లంపల్లి ప్రజలు. 2008 -09 సంవత్సరంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా బెల్లంపల్లికి మంచినీళ్లు అందించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. బిఆర్ ఎస్ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ పథకం ద్వారా బెల్లంపల్లికి కొమరం భీం ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించే కార్యక్రమం చేపట్టారు. మిషన్ భగీరథ పనులు పూర్తయ్యాయి, బిల్లులు డ్రా చేసినప్పటికీ మంచినీళ్లను అందించలేని దౌర్భాగ్య స్థితిలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. కొమురం భీం ప్రాజెక్టు ద్వారా తీసుకువచ్చే నీటిలో ఓబీ కాలుష్యం కలిసి తాగడానికి పనికిరాకుండా పోతున్నాయి. పైపులు అమ్ముకోవడం కోసమే మిషన్ భగీరథ స్కీం తెచ్చారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం భగీరథ పైపులు అమ్ముకోవడం కోసమే కొమరం భీం ప్రాజెక్టుకు మార్చారు.నియోజకవర్గానికి స్థానిక ఎమ్మెల్యే సింగరేణి స్థలాలు కబ్జా చేయడానికి వస్తారనే ప్రచారం ఉంది . ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బులను తన బినామీ రియల్ వెంచర్లలో రోడ్లు వేయడానికి ఎమ్మెల్యే ఖర్చు పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సరిపడా సిబ్బంది సౌకర్యాలు 9 ఏండ్లుగా తీసుకురాలేకపోయారు. స్థానిక ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య కాదు, చేతగాని చెన్నయ్య అని ప్రజలు పిలుస్తున్నారు. టిఆర్ఎస్ అసమర్థ పాలన, చేతగాని చెన్నయ్య లాంటి ఎమ్మెల్యే నిర్వాకం వల్ల అభివృద్ధికి ఆమడ దూరంలో బెల్లంపల్లి. నియంతృత్వాన్ని ఎదిరించే పోరాడే గడ్డ చారిత్రాత్మకమైన పోరాటాలకు పురిటిగడ్డ బెల్లంపల్లి. మీడియా సమావేశంలో డిసిసి అధ్యక్షులు కొక్కిరాల సురేఖ, పిసిసి ఉపాధ్యక్షులు మదన్మోహన్రావు, గండ్ర సుజాత, నాతరి స్వామి, చిలుముల శంకర్ తదితరులు ఉన్నారు.