ఈ నెల 29 నుండి మహిళా జర్నలిస్టులకు ఉచిత వైద్య శిభిరం

హైదరాబాద్ మార్చి,27:

అక్రిడిటేటేడ్ మహిళా జర్నలిస్టులకు ఈ నెల 29 నుండి పది రోజుల పాటు ఉచిత వైద్య శిభిరం నిర్వహించనున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ అర్వింద్ కుమార్ తెలిపారు.అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళా జర్నలిస్టులకు పురస్కార కార్యక్రమంలో మహిళా జర్నలిస్టులు ఉచిత వైద్య శిభిరం నిర్వహించాల్సిందిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావుకి విజ్ఞప్తి చేశారు.ఆ విజ్ఞప్తి కి మంత్రి సానుకూలంగా స్పందించిన మేరకు ఈ నెల 29 తేది నుండి మాసాబ్ ట్యాంక్ లో ఉన్న సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఉచిత వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు.ఈ కాంప్రహెన్సివ్ హెల్త్ చెకప్ లో రక్త పరీక్ష (C.B.P) , బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ బి12, డి3 మొదలైన డయాగ్నోస్టిక్స్ పరీక్షలు , ECG, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మియర్, స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, కంటి స్క్రీనింగ్ , దంత పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు మొదలైన పరీక్షలు చేయనున్నారు.ఈ పరీక్షల రిపోర్ట్ లు అదే రోజు అందజేయనున్నారు.ఈ ఉచిత వైద్య శిభిరాన్ని ఉదయం 7.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు నిర్వహించనున్నారు.సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ఈ శిభిరంలో రాష్ట్ర స్థాయి అక్రిడిటేటేడ్ మహిళా జర్నలిస్టులతో పాటు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుండి అక్రిడిటేషన్ పొందిన మహిళా జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ ఆ ప్రకటనలో కోరారు.జిల్లాలకు చెందిన అక్రిడిటేటేడ్ మహిళా జర్నలిస్టులకు ఆయా జిల్లా కేంద్రాలలో ఉచిత వైద్య శిభిరాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest