గవర్నర్ పై జరుగుతున్న ప్రచారం ఖండించిన రాజ్ భవన్

హైదరాబాద్‌ :

నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతిని పరామర్శించేందుకు గవర్నర్‌ పూలదండతో వచ్చారని జరుగుతున్న ప్రచారాన్ని రాజ్‌ భవన్‌ తీవ్రంగా ఖండించింది. ఖైరతాబాద్‌లోని హనుమంతుడి గుడిలో సమర్పించడానికి కారులో పూల దండ ఉంచామని స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్‌భవన్‌ నుంచి ప్రకటన వెలువడింది.”గవర్నర్‌ వేరే ప్రదేశాల నుంచి రాజ్‌భవన్‌కు తిరిగి వచ్చేటప్పుడు ఖైరతాబాద్‌లోని హనుమంతుడి గుడికి వెళ్లి రావడం చాలా రోజుల నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ విషయాన్ని దుష్ప్రచారం చేస్తూ విపరీత అర్థాలు తీయడం సహేతుకం కాదు. అలాగే ప్రీతి త్వరగా కోలుకోవాలని హనుమంతుడి గుడిలో గవర్నర్‌ ప్రార్థించారు. ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు సమగ్రంగా దర్యాప్తు జరిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గవర్నర్‌ నిమ్స్‌ పర్యటనను సరైన దఅష్టితో అర్థం చేసుకోవాలి” అని ప్రకటనలో పేర్కొంది

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest