మాజీ ఎంపీ డీఎస్‌కు అస్వస్థత

 

హైదరాబాద్‌:

మాజీ ఎంపీ, సీనియర్‌ నేత డి.శ్రీనివాస్‌ (డీఎస్‌) అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో అనారోగ్యానికి గురికావడంతో ఆయన్ను బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. డీఎస్‌ అనారోగ్యానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest